ఎన్నికల వ్యూహాల ఖరారులో భాజపా
భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు.
జె.పి.నడ్డా అధ్యక్షతన దిల్లీలో భేటీ
దిల్లీ: భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన బుధవారం దిల్లీలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయావకాశాలను మెరుగుపరచుకోవడంపై చర్చించుకున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎదుర్కొన్న 160 నియోజకవర్గాల్లోనూ గెలవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 303 లోక్సభ స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బయటపడిన స్థానాలు, పాత మిత్రులకు కేటాయించిన స్థానాల్లోనూ ఈ సారి భారీ ఆధిక్యం సాధించే దిశగా కమలదళ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మరింత అప్రమత్తమైన ఆ పార్టీ నాయకత్వం త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.