ఎన్ని కుట్రలు పన్నినా భారాస అభ్యర్థిగానే పోటీచేస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

నియోజకవర్గంలో పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొంతమంది భారాస నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలు అన్నీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు తెలుసని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిఅన్నారు.

Updated : 18 Aug 2023 07:51 IST

నాచారం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొంతమంది భారాస నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలు అన్నీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు తెలుసని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వాటికి త్వరలోనే ముగింపు పలుకుతానన్నారు. గురువారం మల్లాపూర్‌లోని నోమా ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకి మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ‘‘సొంత పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా... వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థిగానే పోటీ చేస్తా. హ్యాట్రిక్‌ విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందజేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేశా. కొందరు నేతలు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వారి ఆగడాలు నా ముందు సాగవు’’ అని ముత్తిరెడ్డి అన్నారు. పైరవీలకు పాల్పడే నేతలకు కాకుండా ప్రజల మద్దతు ఉన్న యాదగిరిరెడ్డికే భారాస టికెట్‌ కేటాయించాలని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాపీలను ఎమ్మెల్యేకి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని