ఎన్ని కుట్రలు పన్నినా భారాస అభ్యర్థిగానే పోటీచేస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
నియోజకవర్గంలో పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొంతమంది భారాస నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలు అన్నీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు తెలుసని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిఅన్నారు.
నాచారం, న్యూస్టుడే: నియోజకవర్గంలో పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొంతమంది భారాస నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలు అన్నీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు తెలుసని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిఅన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వాటికి త్వరలోనే ముగింపు పలుకుతానన్నారు. గురువారం మల్లాపూర్లోని నోమా ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకి మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ‘‘సొంత పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా... వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థిగానే పోటీ చేస్తా. హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందజేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేశా. కొందరు నేతలు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వారి ఆగడాలు నా ముందు సాగవు’’ అని ముత్తిరెడ్డి అన్నారు. పైరవీలకు పాల్పడే నేతలకు కాకుండా ప్రజల మద్దతు ఉన్న యాదగిరిరెడ్డికే భారాస టికెట్ కేటాయించాలని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాపీలను ఎమ్మెల్యేకి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.