వైకాపా ఓటమికి టపాసులు కాలుస్తా: పృథ్వీరాజ్
‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని గతంలో చెప్పిన వైఎస్ షర్మిల.. నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలై ఆయన్నే పొడుస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని గతంలో చెప్పిన వైఎస్ షర్మిల.. నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలై ఆయన్నే పొడుస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె కడప లోక్సభ స్థానం నుంచి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే అంబటి రాంబాబుతో సంక్రాంతి పండక్కి డ్యాన్సులు వేయిస్తామని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఉండవల్లిలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న ‘స్ట్రీట్ ప్లే’ గురించి లోకేశ్కు వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల్లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చాను. ఈ సారి ఆ పార్టీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాలుస్తాను. చంద్రబాబు, పవన్కల్యాణ్లపై చేసిన విమర్శలకు మంత్రి రోజా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని పృథ్వీరాజ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.