వైకాపా ఓటమికి టపాసులు కాలుస్తా: పృథ్వీరాజ్‌

‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని గతంలో చెప్పిన వైఎస్‌ షర్మిల.. నేడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలై ఆయన్నే పొడుస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు.

Updated : 06 Apr 2024 12:09 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని గతంలో చెప్పిన వైఎస్‌ షర్మిల.. నేడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలై ఆయన్నే పొడుస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె కడప లోక్‌సభ స్థానం నుంచి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే అంబటి రాంబాబుతో సంక్రాంతి పండక్కి డ్యాన్సులు వేయిస్తామని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఉండవల్లిలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న ‘స్ట్రీట్‌ ప్లే’ గురించి లోకేశ్‌కు వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల్లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చాను. ఈ సారి ఆ పార్టీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాలుస్తాను. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై చేసిన విమర్శలకు మంత్రి రోజా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని పృథ్వీరాజ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని