ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. నిరుద్యోగ సమస్య పెరిగింది.. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. వీటిపై ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు.. నిరుద్యోగ సమస్య పెరిగింది.. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. వీటిపై ప్రశ్నిస్తుంటే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. జగన్ తన సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు 13 కంపెనీల పోలీసు బలగాలను మోహరించారు. అదే చిలకలూరిపేటలో ఎన్డీయే సభకు ప్రధాని మోదీ వస్తే అయిదు కంపెనీలను మాత్రమే పంపారు. మీకు ప్రజల అండ ఉంటే ఎందుకంత భయపడుతున్నారు?’ అని జగన్పై మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైకాపావారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.