అసెంబ్లీకి రారు.. ప్రచారానికి తిరుగుతున్నారు: కేసీఆర్పై మంత్రి కొండా సురేఖ విమర్శ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి వాటిని పెద్దలకు అప్పగించి రూ.కోట్లు ఆర్జించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
రామచంద్రాపురం రూరల్, న్యూస్టుడే: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టి వాటిని పెద్దలకు అప్పగించి రూ.కోట్లు ఆర్జించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మెదక్ భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఎన్ఎస్యూఐ విభాగం సభ్యులతో నిర్వహించిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్గా ఉన్న వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి మాత్రం తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన సామాన్యుల పనులు పక్కన పెట్టి మేడిగడ్డ, మిషన్భగీరథ పథకాల ఫైళ్లపై సంతకాలు పెట్టారన్నారు. తమ సర్కారు అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై విమర్శలు చేసే నైతిక హక్కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్లకు లేదని పేర్కొన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా ఉంటూ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పటాన్చెరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, దుబ్బాక పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, రవీందర్గౌడ్, నర్సింహారెడ్డి, వినయ్గౌడ్, అంతిరెడ్డి తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.