కిషన్‌రెడ్డి అసమర్థుడు... తెలంగాణకు ఏమీ చేయలేదు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసమర్థుడని, ఆయన తెలంగాణకు ఒక్క పనీ చేయలేదని, కేంద్రం నుంచి పైసా ఇప్పించలేదని తెరాస విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే జాజాల సురేందర్‌లు ధ్వజమెత్తారు. విభజన

Published : 02 Jul 2022 06:15 IST

తెరాస నాయకుల ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసమర్థుడని, ఆయన తెలంగాణకు ఒక్క పనీ చేయలేదని, కేంద్రం నుంచి పైసా ఇప్పించలేదని తెరాస విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే జాజాల సురేందర్‌లు ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం దగా చేస్తున్నా నోరు మెదపడంలేదని విమర్శించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకివ్వరు? కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారు? దిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా ఆయనను గుర్తుపట్టరు. తెలంగాణ కోసం ఆనాడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. కిషన్‌రెడ్డి చేయకుండా పారిపోయారు. జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో భాజపా నాయకులు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ దందాపై పార్లమెంటులో నిలదీస్తాం. నరేంద్రమోదీని మించిన మోసకారి ఎవరూ లేరు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు’ అని సుమన్‌, దయాకర్‌, సురేందర్‌ ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని