మునుగోడులో పోటీ చేస్తాం

తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని ముంపు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.

Published : 11 Aug 2022 06:11 IST

భూనిర్వాసితుల నిర్ణయం

మర్రిగూడ, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం పరిధిలోని ముంపు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. ఈ జలాశయం పరిధిలో మర్రిగూడెం మండలంలోని చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం వెంకేపల్లి, వెంకేపల్లి తండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల నుంచి  వంద మందికి పైగా ఉప పోరుకు పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు వారంతా బుధవారం చర్లగూడెంలోసమావేశమై చర్చించుకున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని