చైనాపై ఉపేక్ష ఎందుకో : రాహుల్‌

దేశ సరిహద్దులో చైనా దూకుడును అడ్డుకోలేకపోతున్న ప్రధానమంత్రి మోదీ ఎందుకు ఉపేక్షిస్తున్నారో కారణాలు చెబుతూ జాతిని ఉద్దేశించి మాట్లాడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ

Published : 13 Aug 2022 05:44 IST

దిల్లీ: దేశ సరిహద్దులో చైనా దూకుడును అడ్డుకోలేకపోతున్న ప్రధానమంత్రి మోదీ ఎందుకు ఉపేక్షిస్తున్నారో కారణాలు చెబుతూ జాతిని ఉద్దేశించి మాట్లాడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఫేస్‌బుక్‌లో ఆయన ఓ పోస్టు పెట్టారు. దేశ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా ప్రధాని ఎందుకు మౌనం పాటిస్తున్నారో.. మన జాతికి గర్వకారణమైన ఖాదీని కాదని, పాలిస్టర్‌ త్రివర్ణపతాకల దిగుమతిని ఎందుకు ఆశ్రయిస్తున్నారో చెప్పాలన్నారు. సరిహద్దులో చొరబాట్లు పెంచుతున్న చైనా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయో కూడా వివరణ ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని