Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
భద్రతా కారణాలు, భారీ జనసమూహాల నియంత్రణలో వైఫల్యం కారణంగా జమ్మూ- కశ్మీర్లో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ పరిస్థితులకు స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని పార్టీ నేతలు ఆరోపించారు.
శ్రీనగర్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) నేడు జమ్మూ- కశ్మీర్(Jammu Kashmir)లో తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్ర మార్గంలో తీవ్రమైన భద్రతా లోపాలతోపాటు భారీ జన సమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం వైఫల్యమే దీనికి కారణమని కాంగ్రెస్(Congress) నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో కశ్మీర్ లోయకు ప్రవేశ ద్వారం అయిన ఖాజీగుండ్ సమీపంలో యాత్రను ఈ రోజుకు తాత్కాలికంగా నిలిపేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
‘బనిహాల్ టన్నెల్ దాటి ఖాజీగుండ్కు చేరుకున్న రాహుల్.. షెడ్యూల్ ప్రకారం దక్షిణ కశ్మీర్లోని వెస్సు వైపు పాదయాత్ర ప్రారంభించారు. కానీ, అంతలోనే బాహ్య భద్రతా వలయాన్ని నిర్వహించాల్సిన స్థానిక పోలీసులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. భారీ జనసమూహాలను నియంత్రించడంలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. దీంతో రాహుల్ సెక్యూరిటీ ఆయన్ను ముందుకు అనుమతించలేదు. అనంతరం ఆయన ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ వేదిక వద్దకు వెళ్లిపోయారు’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు. శుక్రవారం 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉండగా.. కిలోమీటర్లోపే నిలిపేయాల్సి వచ్చిందన్నారు. అంతకుముందు రాహుల్ దాదాపు 30 నిమిషాల పాటు ఎటూ కదలలేకపోయారని తెలిపారు.
భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ జమ్మూ-కశ్మీర్ ఇన్ఛార్జి రజనీ పాటిల్ ట్వీట్ చేశారు. స్థానిక యంత్రాంగం సంసిద్ధత లేని వైఖరిని ఇవి సూచిస్తున్నాయని విమర్శించారు. ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. అంతా సజావుగా జరిగేలా చూసేందుకు రాహుల్ గాంధీ భద్రతా బృందం స్థానిక యంత్రాంగంతో చర్చలు జరుపుతోందని జైరాం రమేశ్ తెలిపారు. అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా యాత్రలో భాగమయ్యారు. ఈ యాత్ర లక్ష్యం రాహుల్ గాంధీ ప్రతిష్ఠను మెరుగుపరచడం కాదని, దేశంలో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని మార్చడమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.