Harish rao: చెన్నూరు కోసం రూ.1600 కోట్లతో ఎత్తిపోతల పథకం: మంత్రి హరీశ్రావు
లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని రూ.1600 కోట్లతో చెన్నూరులో నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. దీనికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
చెన్నూరు: మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూర్ మండలాల్లో రూ.210 కోట్ల విలువైన 30 అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్రావు (Minister Harish rao) శంకుస్థాపన చేశారు. చెన్నూరులో ఆర్వోబీ, 100 పడకల ఆస్పత్రి, గ్రంథాలయాలు, వీధిలైట్ల ఏర్పాటును ఆయన ప్రారంభించారు. లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకాన్ని చెన్నూరులో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడుతూ.. ‘‘మంచిర్యాల జిల్లాలో రూ.37 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్తో అభివృద్ధి కార్యక్రమం మొదలైంది. రూ.22 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.3కోట్లతో స్టేడియం, రూ.4కోట్లతో బస్ డిపో, రూ.18 కోట్లతో బట్టర్ ఫ్లై లైట్లు, నస్పూర్లో రూ.3.50 కోట్లతో ఔషధ గిడ్డంగి ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం రూ.210 కోట్లతో 30 అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఈరోజు చెన్నూరు దశ దిశ మారుతోంది. చెన్నూరులో రూ.1600 కోట్లతో లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల పథకం కూడా మంజూరైంది. దీనికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం’’ అని హరీశ్రావు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్, భాజపాపై హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ‘‘ఛత్తీస్గఢ్ పాలన తెస్తామని రేవంత్రెడ్డి అంటున్నారు. ఆ రాష్ట్ర పాలన తెలంగాణకు అవసరం లేదు. ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది ఇక్కడికి వలస వస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరోచోటికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వద్దు. మరోవైపు తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోంది. భాజపా నేతలు సీబీఐ, ఈడీ, ఐటీని నమ్ముకున్నారు. ప్రశ్నించిన వారిపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారు’’ అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు