AndhraPradesh : ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు: నందమూరి బాలకృష్ణ

హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ప్రకటించే వరకు కలసి ఉద్యమాలు చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం పట్టణంలోని కనకదాస

Updated : 04 Feb 2022 19:53 IST

హిందూపురం: హిందూపురం పట్టణాన్ని జిల్లాగా ప్రకటించే వరకు కలసి ఉద్యమాలు చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం పట్టణంలోని కనకదాస కళ్యాణ మండపంలో అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైతే రాజీనామా చేయడానికీ వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం పట్టణం జిల్లా కేంద్రానికి అన్ని విధాలా సౌకర్యంగా ఉందని గుర్తు చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని అఖిలపక్ష పార్టీలతో కలసి ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధమవుతామని బాలకృష్ణ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని