Revanth reddy: ఉమ్మడి పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారు: రేవంత్
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్ లో నిర్వహించిన...
మహబూబ్నగర్: నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్ లో నిర్వహించిన ‘విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్’ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేవరకు, పీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పాలమూరు వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఉంటే ఈరోజు వాటిని పక్క రాష్ట్రం అక్రమప్రాజెక్టులు అనేదా?అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ రావాలన్నా, లక్షా 91వేల ఉద్యోగాలు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగాలు, విద్య, నదీ జలాలు.. ఇంకా అనేక వనరుల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఏడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ పాలకులు. నీళ్ల కోసం తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణా నదిపై కట్టాల్సిన ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్ కట్టలేదు. కృష్ణ మీద పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఏడాది కాలంగా నిద్రపోతున్నారు. కృష్ణా జలాలు తెలంగాణకు లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలతో కేసీఆర్ చర్చించాలి’’ అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, ఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డి, సంపత్ కుమార్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు సభలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు