Revanthreddy: ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు: రేవంత్
జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాద్: జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్ జగన్ మొదటి నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్ఛికం కావు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతోంది. పేర్ని నాని వ్యాఖ్యలను తెరాస ఎందుకు ఖండించడం లేదు’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
‘‘పర్యావరణ అనుమతులు లేవని పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. ప్రభుత్వ అలసత్వం వల్లే ఎన్జీటీలో ఓడిపోయాం. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు తీవ్రమైన నష్టం. కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో కాలయాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారు. పాలమూరు - రంగారెడ్డిని కేసీఆర్ మూడేళ్లలో పూర్తి చేస్తానన్నారు. ఆరేళ్లు గడిచినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎన్జీటీ స్టే వల్ల దక్షిణ తెలంగాణకు మరణశాసనం లిఖించినట్టే. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులు శాశ్వత సమాధి కానున్నాయి. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ప్రాజెక్టులపై జగన్ను కేసీఆర్ ఎందుకు ఒప్పించలేదు’’ అని రేవంత్రెడ్డి నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.