Ts News: ప్రధాని మోదీ, కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయి: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ఓ దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాజ్యసభలో సభాపక్ష నాయకునిగా మల్లికార్జున ఖర్గే, తెలంగాణలో శాసనసభాపక్షనేతగా భట్టి విక్రమార్క లాంటి దళిత నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు...
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ఓ దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాజ్యసభలో సభాపక్ష నాయకునిగా మల్లికార్జున ఖర్గే, తెలంగాణలో శాసనసభాపక్షనేతగా భట్టి విక్రమార్క లాంటి దళిత నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. ఏపీలో కూడా దళిత బిడ్డ శైలజానాథ్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. దళిత గిరిజన బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా భవన్లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ప్రైవేటు యూనివర్శిటీలు ఇచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారని ఆక్షేపించారు. కేసీఆర్ పాలనలో పేదలకు చదువు దూరం అయిందని.. మోదీ, కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు