YSRCP: కర్నూల్లోనూ అదే పరిస్థితి.. ‘మమ’ అనిపించిన మంత్రులు
మరో 30 ఏళ్లు రాష్ట్రంలో వైకాపాయే అధికారంలో ఉంటుందని ఏపీ మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సారథ్యంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు.
కర్నూలు: ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రలో భాగంగా వైకాపా మంత్రులు నిర్వహిస్తోన్న సభలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. జనాలు లేకపోవడంతో సభలు వెలవెలబోతున్నాయి. కర్నూలులోని సీ క్యాంపు వద్ద ఆదివారం నిర్వహించిన సభకు ప్రజలెవరూ లేకపోవడంతో మంత్రులు తూతూ మంత్రంగా సభ నిర్వహించి వెళ్లారు.
ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభా వేదిక వద్దకు అధికారులు తరలించారు. కనీసం షామియానాలు కూడా లేకపోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు వెనుదిరిగారు. మంత్రులు ఒంటిగంటకు కర్నూలు చేరుకోగా.. అప్పటికే ప్రజలంతా వెళ్లిపోవడంతో సభ బోసిపోయింది. కుర్చీల్లో కూర్చోవాలంటూ కర్నూలు మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ఎంత మొత్తుకున్నా ఎవరూ రాలేదు. దీంతో మంత్రులు సభను ‘మమ’ అనిపించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరో 30 ఏళ్లు రాష్ట్రంలో వైకాపాయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ సారథ్యంలోనే సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.