రూ.5 వేలు ఇవ్వలేదని భార్య ఆత్మహత్య.. చితిలోకి దూకేసిన భర్త

భార్య చితిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు ఓ భర్త. ఉత్తర్‌ప్రదేశ్‌ మహోబా జిల్లా జైత్‌పుర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహోబా జిల్లా కుల్‌పహాడ్‌ కొత్వాలి పరిధి జైత్‌పుర్‌లో బ్రిజేష్, ఉమ దంపతులు నివసిస్తున్నారు. చికిత్స నిమిత్తం

Updated : 12 Apr 2022 10:57 IST

భార్య చితిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు ఓ భర్త. ఉత్తర్‌ప్రదేశ్‌ మహోబా జిల్లా జైత్‌పుర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహోబా జిల్లా కుల్‌పహాడ్‌ కొత్వాలి పరిధి జైత్‌పుర్‌లో బ్రిజేష్, ఉమ దంపతులు నివసిస్తున్నారు. చికిత్స నిమిత్తం రూ.5,000 కావాలని బ్రిజేష్‌ను ఉమ అడిగింది. మర్నాడు ఇస్తానని భర్త చెప్పిన సమాధానంతో కలత చెందిన ఆమె ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఉమ అంత్యక్రియలు జరుగుతుండగా బ్రిజేష్‌ చితిలోకి దూకాడు. అక్కడున్న వ్యక్తులు అతడిని బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. కట్నం కోసం భర్త, అత్తమామలే తమ కుమార్తెను హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన భార్య చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె చనిపోయాక తనకు బతకాలని లేదని బ్రిజేష్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని