ధోనీ సిక్స్ కొట్టిన బంతి దొరికింది
వన్డే క్రికెట్ ప్రపంచకప్- 2011 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ సిక్స్ కొట్టిన బంతి దొరికింది. దాదాపు పది సంవత్సరాల
2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో..
ముంబయి : వన్డే క్రికెట్ ప్రపంచకప్- 2011 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ సిక్స్ కొట్టిన బంతి దొరికింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ బంతి విషయం ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. ఈ మ్యాచ్ను క్రీడా అభిమానులు మరిచిపోలేరు. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ జట్టు సారథి ధోని సిక్స్ కొట్టి ప్రపంచకప్ను అందించిన తీరు క్రికెట్ ప్రేమికుల మదిలో మెదులుతూనే ఉంటుంది. శ్రీలంక బౌలర్ కులశేఖర వేసిన బంతిని ధోని సిక్సర్గా మలిచిన విధానం.. రవిశాస్ర్తి కామెంటరీ ఆ క్షణాన టీవీల్లో చూసిన వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
ఆ మ్యాచ్లో ధోనీ కొట్టిన బంతి ఏమైంది..
ఆ సమయంలో దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా.. రాంచీ దిగ్గజం ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో దానిపై చర్చ నడిచింది. దిగ్గజ ఆటగాడిని ప్రత్యేకంగా గౌరవించాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) నిర్ణయించింది. ధోనీ కొట్టిన బంతి పడిన సీటును శాశ్వతంగా ధోనీ కోసం కేటాయించాలని అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు క్రికెట్ గవర్నింగ్ బాడీకి లేఖ రాశారు. అనంతరం మహీ కొట్టిన బంతి ఎక్కడ పడింది. దాన్ని ఎవరు తీసుకున్నారు అనే దానిపై ముంబయి క్రికెట్ అసోసియేషన్ వెతుకులాట ప్రారంభించింది. విషయం తెలుసుకున్న టీమిండిమా మాజీ సారథి గవాస్కర్ బంతి ఎక్కడుందో తెలుసుకోడానికి సాయం చేశారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ధోని సిక్స్గా మలిచిన బంతి తన స్నేహితుడి వద్ద ఉందని ఆయన ఎమ్సీఏకు తెలిపారు. స్టేడియంలోని ఎల్ బ్లాక్లో 210 సీటులో కూర్చున్న వ్యక్తి తన పక్క సీటులో పడిన బంతిని తీసుకున్నట్లు గవాస్కర్ చెప్పటంతో వెతుకులాటకు తెరపడింది.
ధోని కొట్టిన బంతి పడిన సీటును అందంగా అలంకరించటంతో పాటు ప్రత్యేక అక్షరాలతో ఫలకాన్ని సైతం ఏర్పాటు చేస్తామని ఎమ్సీఏ సభ్యుడు తెలిపారు. దీంతో భవిష్యత్తులో మ్యాచ్లు చూడటానికి స్టేడియానికి వచ్చే అభిమానులు ధోని కొట్టిన సిక్స్ పడిన ప్రాంతాన్ని చూసి ప్రపంచ కప్ గెలిచిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటారని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు