కన్నీళ్లు దాచుకునే ఉంటావ్‌!

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోని.. భావోద్వేగాలను ఎప్పుడూ బయట ప్రదర్శించేవాడు కాదు. రిటైర్మెంట్‌ నిర్ణయం  ప్రకటించినప్పుడు కూడా అతను  కన్నీళ్లను దిగమింగే ఉంటాడని ధోని భార్య సాక్షి తెలిపింది. తన భర్త రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ఆమె సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టింది.

Updated : 17 Aug 2020 06:58 IST

దిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోని.. భావోద్వేగాలను ఎప్పుడూ బయట ప్రదర్శించేవాడు కాదు. రిటైర్మెంట్‌ నిర్ణయం  ప్రకటించినప్పుడు కూడా అతను  కన్నీళ్లను దిగమింగే ఉంటాడని ధోని భార్య సాక్షి తెలిపింది. తన భర్త రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ఆమె సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టింది. ‘‘నువ్వు సాధించిన ఘనతల పట్ల గర్వంగా ఉండాలి. ఆటకు అత్యుత్తమ సేవలు అందించినందుకు అభినందనలు. నీ విజయాలు, వ్యక్తిత్వం పట్ల గర్వపడుతున్నా. నీకిష్టమైన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించే సమయంలో కన్నీళ్లను దిగమింగే ఉంటావని అనుకుంటున్నా. భవిష్యత్‌లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ గొప్ప విషయాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నా’’ అని ఆమె పోస్టు చేసింది. ఆ పోస్టులో అమెరికా రచయిత్రి మాయ ఏంజిలో చెప్పిన.. ‘‘నువ్వు చెప్పిన దాన్ని, చేసిన దాన్ని ప్రజలు  మర్చిపోవచ్చు. కానీ నువ్వు పంచిన అనుభూతిని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు’’ అనే మాటలను సాక్షి  ప్రస్తావించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని