Shami: ఒకప్పుడు బిర్యానీ ఎక్కువగా తినేవాడిని.. ఇప్పుడు నా డైట్ మారిపోయింది : షమీ
33 ఏళ్ల మహమ్మద్ షమీ (Shami) ఒకప్పుడు ఫిట్నెస్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. డైట్ ప్రణాళిక మార్చుకోవడంతో ఫిట్నెస్ను మెరుగు పర్చుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షమీ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) అద్భుతమైన బౌలింగ్ దాడితో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత బౌలర్ మహమ్మద్ షమీ (Shami) ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే జట్టుతో చేరతాడు. ఫిట్నెస్ లేకపోతే ఆగిపోతాడు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న షమీ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత ప్రధాని మోదీ తమతో సంభాషించడం.. పాక్లో తనపై వచ్చిన ట్రోలింగ్కు స్పందించాడు. తాజాగా తన డైట్, ఫిట్నెస్పై మాట్లాడాడు.
‘‘నా డైట్ ప్లాన్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తా. అదీనూ నాన్వెజ్ను తీసుకుంటా. ఎందుకంటే నేనేమీ సప్లిమెంట్గా ఇతర ఫుడ్ను తీసుకోను. ఒకప్పుడు బిర్యానీ ఎక్కువగా తినేవాడిని. దాంతో చాలా మంది ఆటపట్టించేవారు. అప్పుడు నా డైట్కు ఒక ప్రణాళిక అంటూ ఉండేది కాదు. ఏది మంచిది.. ఏది అవసరం లేదనే విషయాలపై అవగాహన తక్కువ. దీంతో ఎక్కువగానే బిర్యానీ లాగించేసేవాడిని. ఎప్పుడైతే గాయపడ్డానో.. ఆ తర్వాత కఠినమైన డైట్గా పాటిస్తున్నా. ఫిట్నెస్ స్థాయి ఎంత కీలకమో అర్థం చేసుకున్నా. గతంతో పోలిస్తే ఇప్పటి నా డైట్ మారిపోయింది. నా ఫిట్నెస్ కూడా మెరుగైంది.
చాలా మంది నేను బాగా బరువులు ఎత్తేస్తానని అనుకుంటారు. కానీ, వారందరే నాకంటే ఎక్కువగా బరువును ఎత్తుతారని అనుకుంటా. దీనిని సోషల్ మీడియాలో ఎప్పుడూ పెట్టలేదు. నేను ఏం చేస్తున్నాననదే ఆన్లైన్ వేదికగా పెట్టడం నాకిష్టం ఉండదు. అయితే, నేనేమీ చేయడం లేదని కూడా అనుకొనేవారు లేకపోలేదు. బెంచ్ ప్రెస్ ఎక్సర్సైజ్లో 150 కేజీలు, లెగ్ ప్రెస్ ఎక్సర్సైజ్లో 750 కేజీల వరకు చేయగలను’’ అని షమీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది