రసమయి బాలకిషన్‌కు డాక్టరేట్‌

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వర్సిటీలోని జానపద కళల శాఖలో ఆచార్య.....

Published : 17 Nov 2021 05:03 IST

రసమయి బాలకిషన్‌కు డాక్టరేట్‌ అందజేస్తున్న ఆచార్య కిషన్‌రావు. పక్కన ప్రొ.రమేశ్‌, ప్రొ.మురళీకృష్ణ

నారాయణగూడ, న్యూస్‌టుడే: మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వర్సిటీలోని జానపద కళల శాఖలో ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూంధాం) పాత్ర’ అనే అంశంపై రసమయి చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్‌ ఇచ్చినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీహెచ్‌ మురళీకృష్ణ తెలిపారు. 2014-15 విద్యా సంవత్సరంలో రసమయి పీహెచ్‌డీ కోర్సులో చేరగా.. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు కోర్సు పూర్తయినట్లు మంగళవారం ధ్రువీకరణపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని