భూ కేంద్రం స్తంభించింది!
ఒక ఇంగ్లిష్ సినిమా. పేరు ‘ద కోర్’. దీని ఇతివృత్తం భూమి అంతర్భాగ భ్రమణం ఆగిపోవటం. దీంతో అయస్కాంత క్షేత్రం కుప్పకూలుతుంది.
ఒక ఇంగ్లిష్ సినిమా. పేరు ‘ద కోర్’. దీని ఇతివృత్తం భూమి అంతర్భాగ భ్రమణం ఆగిపోవటం. దీంతో అయస్కాంత క్షేత్రం కుప్పకూలుతుంది. వాతావరణం స్తంభిస్తుంది. ఇప్పుడదే నిజమైంది. భూమి అంతర్భాగం తిరగటం ఆగిపోయిందని, త్వరలో ఇది వ్యతిరేక దిశలో తిరగొచ్చనీ బీజింగ్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. అయస్కాంత క్షేత్రం, వాతావరణం కుప్పకూలటం వంటి తీవ్ర అనర్థాలు సంభవించకపోవచ్చు గానీ భూమిపై దీని ప్రభావమైతే పడటం ఖాయం.
భూమిలో గ్రహం! భూమి లోపలి అంతర్భాగం (ఇన్నర్ కోర్) గురించి ఇలాగే చెప్పుకోవాలి. భూమి పైభాగం (క్రస్ట్) తిరుగుతూనే ఉన్నా ఇది నిలిచిపోవచ్చు మరి. అప్పటివరకూ తిరిగే దిశను మార్చుకొని వ్యతిరేక దిశలోనూ తిరగొచ్చు. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? ఐరన్, నికెల్తో కూడిన భూమి లోపలి అంతర్భాగం ఘన రూపంలో ఉంటే.. దాని మీదుండే భూమి వెలుపలి అంతర్భాగం (ఔటర్ కోర్) ద్రవ రూపంలో ఉంటుంది. ఇదే భూమి పైపొర, మ్యాంటిల్ నుంచి లోపలి అంతర్భాగాన్ని వేరు చేస్తుంది. లోపలి, వెలుపలి అంతర్భాగాల మధ్య ఉండే సరిహద్దును అనదర్ డిస్కంటిన్యూటీ అంటారు. కీత్ ఎడ్వర్డ్ బుల్లెన్ ప్రతిపాదించటం వల్ల బుల్లెన్ లేదా లెహ్మన్ డిస్కంటిన్యూటీ అనీ పిలుచుకుంటారు. దీని మూలంగానే భూమి లోపలి అంతర్భాగం భ్రమించినా, ఆగినా పైకేమీ తెలియదు. ద్రవరూప ఔటర్ కోర్ లోపల ఉండటం, అదీ బలమైన అయస్కాంత క్షేత్రం కలిగుండటం.. పైగా మ్యాంటిల్ గురుత్వాకర్షణ బలం లాగటం వల్ల ఇన్నర్ కోర్ చాలా వేగంగా తిరుగుతుంటుంది. కొన్నిసార్లు ఇది నెమ్మదించొచ్చు కూడా. ఇదే ఇప్పుడు జరుగుతోంది. నిజానికి భూమి అంతర్భాగ భ్రమణం 2009-2020 మధ్యలోనే నిలిచిపోయిందని బీజింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే పదేళ్లలో ఇది వ్యతిరేక దిశలో తిరగొచ్చనీ అనుకుంటున్నారు. పైగా ఇదొక చట్రంలా కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. ప్రతి 70 ఏళ్లకోసారి భూ అంతర్భాగం ఇలా భ్రమణ దిశను మార్చుకుంటూ వస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపాలను పట్టించే సీస్మిక్ తరంగాల సాయంతోనే ఈ విషయాన్ని గుర్తించారు. భూకంపం సంభవించినప్పుడు కంపనాలు భూ అంతర్భాగం ద్వారా నలువైపులకూ విస్తరిస్తాయి. అవి తిరిగి వెనక్కి వస్తాయి. వీటిని కంప్యూటర్ విశ్లేషించి, భూకంప కేంద్రాన్ని గుర్తిస్తుంది. తాజా పరిశోధనలో సమాచారాన్ని గుర్తించటానికి ఇదే కీలకంగా మారింది. ద్రవరూపంలో ఉండే వెలుపలి అంతర్భాగంతో పుట్టుకొచ్చే అయస్కాంత క్షేత్రం ద్వారానే లోపలి అంతర్భాగం భ్రమిస్తుంటుంది. ఇదెలా భ్రమిస్తుందనేది అర్థం చేసుకోగలిగితే భూమి పొరలు ఒకదానిపై మరోటి ఎప్పుడు, ఎలాంటి ప్రభావం చూపుతాయనేది తెలుసుకోవటానికి వీలవుతుంది. కాబట్టే తాజా పరిశోధనకు అంత ప్రాధాన్యం.
ఇప్పుడేం జరుగుతుంది?
భూమి లోపలి అంతర్భాగ భ్రమణ దిశ మారితే రోజు వ్యవధి తగ్గుతుంది. అయితే మనకు తేడా ఏమీ తెలియదు. ఏడాదికి మిల్లీసెకండ్ల మేరకు రోజు తగ్గుతూ వస్తుంది. భూ అయస్కాంత క్షేత్రం మీదా స్వల్ప ప్రభావం పడొచ్చు. కానీ భూమి మీద ప్రాణులకు ఎలాంటి హాని
కలగదు.
అంతా విశేషమే!
భూమిని ప్రధానంగా నాలుగు పొరలుగా విభజించు కోవచ్చు. భూమి పైపొర (క్రస్ట్) కింద మ్యాంటిల్ ఉంటుంది. దీనికి దిగువన ద్రవరూప వెలుపలి అంతర్భాగం (ఔటర్ కోర్).. దీని కింద లోపలి అంతర్భాగం (ఇన్నర్ కోర్) ఉంటాయి. ఘనరూపంలో ఉండే లోపలి అంతర్భాగం దాదాపు ప్లూటో గ్రహమంత ఉంటుంది. దీని వ్యాసార్థం సుమారు 1,221 కిలోమీటర్లు (వ్యాసం 2442 కి.మీ.). ఘనపరిమాణం సుమారు 760 కోట్ల క్యూబిక్ కి.మీ. ఇది భూ ఘనపరిమాణంలో సుమారు 0.69 శాతం. ఇన్నర్ కోర్ పీడనం సుమారు 330 నుంచి 360 గిగాపాస్కల్ వరకు ఉంటుంది. కేంద్రం వద్ద దీని సాంద్రత 13.0 కిలో/ఎల్.. ఉపరితలం వద్ద 12.8 కిలో/ఎల్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇన్నర్ కోర్ ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5,430 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా. ఇది సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతతో దాదాపు సమానం! అంత అధిక ఉష్ణోగ్రతలో ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఎలా ఉంటుంది? దీనికి కారణం ఇన్నర్ కోర్ పీడనమే. అత్యధిక పీడనం మూలంగానే ఐరన్ కరగకుండా ఘన రూపంలో ఉండటం సాధ్యమైంది.
* ద్రవరూప ఔటర్ కోర్లో సగటున 2.5 మిల్లీటెస్లాస్ వరకు అయస్కాంత క్షేత్రం ఉంటుందని 2010లో బ్రూస్ బఫే నిర్ధరించారు. మహా సముద్రాల్లో చంద్రుడు, సూర్యుడు అలలను సృష్టించినట్టుగానే భూమిలోని ద్రవ ఔటర్ కోర్లోనూ అలలను పుట్టిస్తాయనే సూత్రం మీద ఆయన అధ్యయనం నిర్వహించారు. ఔటర్ కోర్ అయస్కాంత క్షేత్రం ద్వారా ద్రవం కదులుతున్నప్పుడు విద్యుత్ ప్రవాహాలు పుట్టుకొస్తున్నాయని, ఇవి వేడిని బట్టి శక్తిని వెదజల్లుతాయని గుర్తించారు. ఇది అలల మీద చూపే ప్రభావం ఆధారంగా ఇన్నర్ కోర్లోని అయస్కాంత క్షేత్రం బలాన్ని అంచనా వేశారు. ఇది పరోక్ష గణనే.
ఏంటీ దీని గొప్ప?
భూ ఘనపరిమాణంతో పోలిస్తే ఇన్నర్ కోర్ ఘనపరిమాణం (1%) తక్కువే అయినా అయస్కాంత క్షేత్ర శక్తి సుమారు 10% వరకు ఉంటుంది. ఇది ఔటర్ కోర్ ద్రవం కదలికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. భూ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించటంలోనూ పాలు పంచుకుంటుంది. భూ అయస్కాంత క్షేత్రం లేకపోతే ప్రాణుల మనుగడ అసాధ్యం. అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్ నుంచి భూమిని కాపాడేది అయస్కాంత క్షేత్రమే.
భూమి ఏర్పడ్డాకే..
అంతర్భాగం కన్నా భూమి వయసే పెద్దది! సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. ఆరంభంలో ఇదంతా భారీ వేడి బంతే. రేడియోధార్మిక శక్తి క్షీణించటం, మిగిలిపోయిన వేడి భూమిని మరింత వేడెక్కించాయి. సుమారు 50 కోట్ల సంవత్సరాల తర్వాత ఐరన్ కరిగే స్థితికి ఉష్ణోగ్రత పెరిగింది. ఇది భూమి చరిత్రలో కీలక దశ అనుకోవచ్చు. దీన్ని ఐరన్ ఉపద్రవం అని పిలుచుకుంటారు. ఇది కరిగిన రాతి పదార్థాన్ని మరింత వేగంగా కదిలేలా చేసింది. ఈ క్రమంలో సిలికేట్లు, నీరు, చివరికి గాలి భూమి పైభాగాన స్థిరపడ్డాయి. తొలిదశ మ్యాంటిల్, క్రస్ట్కు ఇవే ఆధారం. ఐరన్, నికెల్, ఇతర భార లోహాలు గురుత్వాకర్షణ ప్రభావంతో భూమి కేంద్రంలోకి చేరుకున్నాయి. ఈ ప్రక్రియను ప్లానెటరీ డిఫరెన్షియేషన్ అంటారు. ఉష్ణాన్ని వెదజల్లే భూ అంతర్భాగాన్ని మండే కొలిమితో పోల్చుకోవచ్చు. ఇన్నర్ కోర్కు సమీపంలో ఉండే ద్రవ ఔటర్ కోర్ సరిహద్దు గట్టిపడే క్రమంలోనే ఈ ఉష్ణం వెలువడుతుంది.
పెరుగుతూ వస్తోంది
భూమి చల్లబడుతున్నకొద్దీ ఇన్నర్ కోర్ పెరుగుతూ వస్తుంది. ఇది ఏటా సుమారు మిల్లీమీటరు మేరకు పెరుగుతుందని అంచనా. వెలుపలి అంతర్భాగం ముక్కలు గట్టిపడటం వల్ల దీని సైజు పెరుగుతుంది. అయితే అన్నిచోట్లా ఒకేలా పెరగదు. టెక్టోనిక్ ఫలకాలు మ్యాంటిల్లోకి జారిపడే చోట్ల ఎక్కువగా పెరుగుతుంది. మునిగిపోయే ఫలకాలు అంతర్భాగం నుంచి వేడిని గ్రహిస్తాయి. చుట్టుపక్కల భాగాలను చల్లబరుస్తాయి. ఫలితంగా గట్టిపడే ప్రక్రియ పెరుగుతుంది.
సీస్మిక్ తరంగాలతో..
భూమి మ్యాంటిల్ గురించి శాస్త్రవేత్తలు చాలా విషయాలే తెలుసుకున్నారు గానీ కోర్ గురించే అంతగా తెలియదు. నేరుగా లెక్కించటానికి దీని నమూనాలేవీ లేవు. ఎందుకంటే ఇన్నర్ కోర్ను చేరుకోవటం అసాధ్యం. సీస్మిక్ తరంగాలు, భూమి అయస్కాంత క్షేత్రం విశ్లేషణ ఆధారంగానే చాలావరకు ఈ అంతర్భాగాన్ని అంచనా వేస్తున్నారు. ఇన్నర్ కోర్ స్వరూపాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు వాడుకునేది దీన్నుంచి వెళ్లే సీస్మిక్ తరంగాలనే. భూ ఉపరితలానికి 30 కి.మీ. లోపల ఏర్పడే భూకంపాలతో మరింత ఎక్కువ సమాచారం లభిస్తుంది. సీస్మిక్ తరంగాల్లో ప్రైమరీ (పీ), సెకండరీ (ఎస్) అని రెండు రకాలుంటాయి. పీ తరంగాలు ఘన, ద్రవ పదార్థాల ద్వారా ప్రయాణిస్తాయి. అదే ఎస్ తరంగాలైతే కేవలం ఘన పదార్థాల నుంచే వెళ్తాయి. పీ, ఎస్ తరంగాలు వేర్వేరు వేగాల్లో ప్రయాణిస్తాయి. వేర్వేరు వేగాలతో ఆయా పదార్థాలను తాకుతాయి. ఇవి వెనక్కి రావటం, పదార్థాల గుండా సాగటం వంటి ఆధారంగా ఇన్నర్ కోర్ స్వభావాన్ని గుర్తిస్తారు. దీని సమాచారాన్ని తెలుసుకోవటానికి మరికొన్ని అంశాలూ ఉపయోగపడతాయి. వీటిల్లో ఒకటి భూ అయస్కాంత క్షేత్రం. ఇది చాలావరకు ఔటర్ కోర్లోని ద్రవ, విద్యుత్ ప్రవాహాల నుంచి పుట్టుకొస్తుంది. కానీ ఇన్నర్ కోర్ నుంచి బయటకు ప్రవహించే వేడి దీన్ని బలంగానే ప్రభావితం చేస్తుంది. లోపలి పొరల సాంద్రత, కొలత, పరిమాణాలు సైతం భూమి ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ పరిధి, భూమి కోణీయ వంపు మీద ప్రభావం చూపుతాయి.
* భూమిలో వెలుపలి అంతర్భాగంతో కలవకుండా ఘన అంతర్భాగం ఉన్నట్టు 1936లో డచ్ శాస్త్రవేత్త ఇంగే లెహ్మాన్ కనుగొన్నారు. న్యూజిలాండ్లో సంభవించిన భూకంపాల సీస్మోగ్రామ్స్ను అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. మొదట్లో లోపలి అంతర్భాగం ఘన ఐరన్తో ఏర్పడి ఉండొచ్చనే అనుకున్నారు. కానీ 1952లో ఫ్రాన్సిస్ బిర్చ్ అనే శాస్త్రవేత్త ఇది ఐరన్ స్ఫటికాలతో కూడుకొని ఉండొచ్చని తేల్చారు. చివరికి ఇన్నర్ కోర్ కఠినత్వాన్ని 1971లో నిర్ధరించారు. నిజానికి ఇన్నర్ కోర్లో ఏమేం ఉంటాయో తెలిపే ప్రత్యక్ష రుజువులేవీ లేవు. అయితే గ్రహాల ఏర్పాటు సిద్ధాంతాన్ని అనుసరించి ఇది ప్రధానంగా ఐరన్-నికెల్ మిశ్రమ లోహమని భావిస్తున్నారు. కొద్దిమొత్తంలో సిలికాన్, ఆక్సిజన్, సల్ఫర్ వంటివి ఉండే అవకాశం లేకపోలేదనీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.
విలువైన మూలకాలు
ఐరన్లో కరిగే మూలకాలను సైడ్రోఫైల్స్ అంటారు. ఇవన్నీ బంగారం, ప్లాటినం, కోబాల్ట్ వంటి అమూల్య లోహాలే. భూ అంతర్భాగంలో మరో ముఖ్యమైన మూలకం సల్ఫర్. నిజానికి భూమి మీది సల్ఫర్లో 90% అంతర్భాగంలోనే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్