భారత రాష్ట్ర సమితి ఐదు ముక్కలవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భువనగిరి అర్బన్, న్యూస్‌టుడే: భారత రాష్ట్ర సమితి ఐదు ముక్కలు కావడం ఖాయమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘తెరాస నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందినప్పుడే ఆ పార్టీ పనైపోయింది. త్వరలో ఐదు ముక్కలవుతుంది. అందులో భారత రాష్ట్ర సమితి పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా కేసీఆర్‌ వ్యవహరిస్తారు. కేటీఆర్‌ భారత రాష్ట్ర సమితి, హరీశ్‌రావు భారత రాష్ట్ర సమితి(హెచ్‌), సంతోశ్‌రావు భారత రాష్ట్ర సమితి(ఎస్‌), భారత రాష్ట్ర సమితి హిమాన్షుగా పార్టీ విడిపోతుంది. కవిత మాత్రం ఏం చేస్తారో నాకు తెలియదు. అయిదేళ్లు ఎంపీగా ఉండి ప్రజలకు ఏమీ చేయని కవిత ఇప్పుడు జనంబాట పేరుతో ఏం సాధిస్తారు’’ అని ప్రశ్నించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యుడు బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని