యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే
ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు.
తొలి విడతలో మూడు కోట్ల మందికి
సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి
మరోలా అర్థం చేసుకోవద్దు..
ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు.- ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విడతలో ప్రజా ప్రతినిధులకు చోటు ఉండదని చెప్పారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సిన్ అందజేతపై చర్చించడానికి సోమవారం ఆయన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో మూడు కోట్ల యోధులు సహా మొత్తం 30 కోట్ల మందికి అందబోతోందని ప్రధాని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఇంతమందికి టీకా వేయడం ప్రపంచంలోనే అతిపెద్ద కసరత్తుగా నిలిచిపోతుందన్నారు.
దేశీయ తయారీ గర్వకారణం
‘‘మన దేశంలో ఇప్పటికే తయారైన రెండు కొవిడ్-19 టీకాలు ప్రపంచంలో ఇతర రకాల కంటే ఎంతో చౌక. దేశీయ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేశారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ సిద్ధం చేసిన కొవాగ్జిన్ టీకాలతో పాటు మరో నాలుగు త్వరలో రాబోతున్నాయి. వ్యాక్సిన్లు మొదలయ్యాక దేశంలో కరోనాపై పోరు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటుంది. కసరత్తు రెండో దశకు చేరేనాటికి ఇంకొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పనితీరు గురించి తగినంత సమాచారం లేకుండానే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామన్న విపక్ష నేతల ఆరోపణలు సబబు కాదు. పౌరులకు సమర్థమైన వ్యాక్సిన్లు అందేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. టీకాల విషయంలో శాస్త్రవేత్తలదే తుది నిర్ణయమని నేను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాను. అత్యవసర అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం గర్వకారణం. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడాల్సి వస్తే మనకెంత కష్టమయ్యేదో ఊహించుకోవచ్చు’’ అని మోదీ చెప్పారు.
మన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది
టీకాలు వేయడంలో మన దేశానికి ఉన్న అనుభవం ఇప్పుడెంతో ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాతే టీకాలకు ప్రాధాన్యాలను నిర్ణయించామని వివరించారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పారామిలిటరీ బలగాలు, హోంగార్డులు, విపత్తు నిర్వహణ సేవకులు, పౌర రక్షణ జవాన్లు, కంటెయిన్మెంట్/ నిఘాతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులు తొలి విడతలో వ్యాక్సిన్ పొందుతారని చెప్పారు. వీరంతా కలిసి మూడు కోట్ల వరకు ఉంటారన్నారు. ఎన్నికల్లో బూత్స్థాయి వ్యూహాన్ని అనుసరించిన రీతిలోనే ఇప్పుడు ముందుకు వెళ్తామని చెప్పారు. ఎవరికి టీకా వేయాలో గుర్తించి, పర్యవేక్షించడమే అత్యంత ముఖ్యాంశమన్నారు. ఆధార్ సాయంతో లబ్ధిదారుల్ని గుర్తించి, సకాలంలో వారికి రెండో మోతాదు అందేలా చూస్తామని చెప్పారు. మొదటి మోతాదు తీసుకున్నవారికి కొ-విన్ యాప్ద్వారా డిజిటల్ ధ్రువపత్రం అందుతుందని, రెండో మోతాదును అది గుర్తుచేసి, ఆ తర్వాత తుది ధ్రువీకరణను ఇస్తుందని తెలిపారు.
‘కరోనా విస్తృతి విషయంలో అనేక దేశాల కంటే మన దేశం మెరుగ్గా ఉండడం ఆనందదాయకమే. అయినా నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదు. ఆరు నుంచి ఎనిమిది నెలల క్రితం ప్రజల్లో కనిపించిన భయాందోళన ఇప్పుడు లేదు. కరోనాపై పోరాడే విషయంలో ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం.. ఆర్థిక కార్యకలాపాలపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీకా ఇచ్చే కార్యక్రమంపై వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు జాగ్రత్త వహించాలి. వీటికి కళ్లెం వేయడంలో సామాజిక, మతపరమైన బృందాలను భాగస్వాముల్ని చేయాలి’ అని సూచించారు. రెండు రోజుల క్రితం తాను నిర్వహించిన సమీక్షలో రాష్ట్రాల నుంచి మంచి సలహాలు వచ్చాయని, కేంద్రం-రాష్ట్రాల మధ్య సహకారం.. సమాఖ్యతత్వానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు