అయినా వైద్యం భారమే!
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా.. వైద్య ఖర్చులు పేద, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగానే ఉంటున్నాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి 17.5 శాతం ...
39.8 శాతానికి పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం
49.7శాతం వెచ్చిస్తున్న ప్రజలు
ప్రజల తలసరి సొంత ఖర్చు రూ.2,120గా నమోదు
2017-18 జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక వెల్లడి
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా.. వైద్య ఖర్చులు పేద, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగానే ఉంటున్నాయి. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి 17.5 శాతం పెరిగి 39.8 శాతానికి చేరినట్లు జాతీయ ఆరోగ్య వ్యయ నివేదిక తాజాగా వెల్లడించింది. అదే సమయంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల సొంత ఖర్చు శాతం కూడా 62.1 నుంచి 49.7కి (రూ.2,834 నుంచి 2,120కి) తగ్గింది. వైద్య వ్యయంలో సర్కారు వాటా గణనీయంగా పెరగడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం.. ప్రజలే దాదాపు సగం భరించాల్సి రావడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. సర్కారు వైద్యంలో ఉచిత చికిత్స పొందినా.. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి రావడం, నిర్ధారణ పరీక్షలను ప్రైవేటు కేంద్రాల్లో చేయించాల్సి వస్తుండడంతో.. అంతకుమించి రోగి జేబులోంచి ఖర్చవుతోంది. ఇక ప్రైవేటులోకెళ్తే అడ్డగోలు పరీక్షలు, ఇష్టానుసార ధరలతో రోగి ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి కుంగదీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య వ్యయంలో సర్కారు వాటాను పెంచడంతో పాటు.. ఉచిత ఔషధాలు, నిర్ధారణ పరీక్షలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ పథకం కింద ప్రోత్సాహక నగదు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తెలంగాణ డయాగ్నస్టిక్స్ పథకం కింద ఉచిత నిర్ధారణ పరీక్షలను హైదరాబాద్లో అమలు చేయడం, మహబూబ్నగర్, సిద్దిపేటలో కొత్త వైద్యకళాశాలలు రావడంతో స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రావడం తదితర అభివృద్ధి కార్యక్రమాలతో 2014-15తో పోలిస్తే 2017-18 నాటికి ప్రజలకు కొంత మేరకు ఆర్థిక భారం తప్పిందని వైద్యవర్గాలు విశ్లేషించాయి.
తలసరి ఖర్చులో కేరళదే మొదటిస్థానం
* మొత్తం ఆరోగ్య వ్యయంలో తలసరి ఖర్చు అత్యధికంగా కేరళలో రూ.9,264 నమోదు కాగా.. ఇందులో ప్రజలు చేస్తున్న ఖర్చు రూ.6,363, ప్రభుత్వ ఖర్చు రూ.2,272గా తేలింది.
* హిమాచల్ప్రదేశ్లో తలసరి వ్యయం రూ.6,541 కాగా.. ప్రజలు రూ.3,220, ప్రభుత్వం రూ.3,177 ఖర్చు చేస్తున్నారు.
* పశ్చిమబెంగాల్లో ఈ వ్యయం రూ.4,460 కాగా.. ప్రజలు రూ.3,115 భరిస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్లో రూ.4,628 వ్యయం అవుతుండగా.. ఇందులో ప్రభుత్వం రూ.1,381, ప్రజలు రూ.3,102 చొప్పున భరిస్తున్నారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది