టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా మహేందర్రెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (టీఎస్పీఎస్సీకి) ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు.
సభ్యులుగా మరో అయిదుగురు
కొత్త బోర్డు ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (టీఎస్పీఎస్సీకి) ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మన్తో పాటు మరో అయిదుగురు సభ్యులున్నారు. ఛైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్ సర్వీసు అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్కో ఈడీ యరబాడి రామ మోహనరావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజినీకుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఛైర్మన్గా వ్యవహరించిన బి.జనార్దన్రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్రెడ్డి, సభ్యులుగా అయిదుగురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి ప్రతిపాదించింది. పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు. ఈ మేరకు వారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్తో పాటు సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు. ఆలోగా 62 ఏళ్లు పూర్తయితే పదవీ కాలం ముగుస్తుంది.
ముదిరెడ్డి మహేందర్రెడ్డి
పుట్టిన తేదీ: 3-12-1962
స్వస్థలం: కిష్టాపురం, ఖమ్మంజిల్లా
విద్యార్హత: ఎంటెక్ (ఐఐటీ, దిల్లీ)
ప్రభుత్వ సర్వీసు: ఇండియన్ పోలీసు సర్వీసు, విశ్రాంత డీజీపీ, తెలంగాణ
మహేందర్రెడ్డికి పోలీసుశాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా, ధీశాలిగా పేరుంది. సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సొంతగ్రామం కిష్టాపురం. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ప్రస్తుత ఎన్ఐటీ)లో బీటెక్ సివిల్ చదివారు. దిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతూ 1986లో సివిల్స్కు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో జగిత్యాల, గుంటూరు, గోదావరిఖనిలో ఏఎస్పీగా పనిచేస్తూ మావోయిస్టు గ్రూపుల నియంత్రణతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్గా నాలుగేళ్లు పనిచేశారు. గ్రేహౌండ్స్లో కమాండో ఆర్గనైజేషన్ చీఫ్గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, హైదరాబాద్ సీపీగా పనిచేశారు. డీజీపీగా ఫ్రెండ్లీ పోలీసింగ్ సంస్కరణలు తీసుకువచ్చారు. పోలీసు శాఖలో 30 ఏళ్లపాటు పనిచేసిన ఆయనకు ఐపీఎం, పీఎం, పీపీఎం అవార్డులు లభించాయి.
అనితా రాజేంద్ర
పుట్టినతేదీ: 4-2-1963
స్వస్థలం: చంచల్గూడ, పాతబస్తీ, హైదరాబాద్
విద్యార్హత: ఎంఏ, ఎల్ఎల్బీ
ప్రభుత్వ సర్వీసు: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఐఏఎస్), విశ్రాంత ముఖ్యకార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్కు చెందిన అనితా రాజేంద్ర 1992లో ప్రభుత్వసర్వీసులో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ శాఖకు పలు అవార్డులు లభించాయి. 2023 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
నర్రి యాదయ్య
పుట్టిన తేదీ: 10-2-1964
స్వస్థలం: సర్వేల్, యాదాద్రిజిల్లా
విద్యార్హత: ఎంటెక్, పీహెచ్డీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
ప్రభుత్వ సర్వీసు : సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూ హైదరాబాద్
యాదాద్రి జిల్లా సర్వేల్లోని మల్లారెడ్డిగూడకు చెందిన నర్రి యాదయ్య 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధన వృత్తిని ప్రారంభించారు. జేఎన్టీయూ హైదరాబాద్కు నాలుగున్నరేళ్లుగా రిజిస్ట్రార్గా, ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్గా పనిచేశారు. 2016 నుంచి ఈఈఈ విభాగం సీనియర్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు.
యరబాడి రామమోహనరావు
పుట్టినతేదీ: 15-4-1963
స్వస్థలం: దేసినేనిపాలెం, మధిర, ఖమ్మం జిల్లా
విద్యార్హత: బీఈ (సివిల్), ఎంబీఏ
ప్రభుత్వ సర్వీసు: ఈడీ, టీఎస్జెన్కో జల విద్యుత్తు విభాగం
రామమోహనరావు 1986లో విద్యుత్తు బోర్డులో ఏఈగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ)గా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్కోలలో ఈఈ, ఎస్ఈ, సీఈగా పనిచేశారు. 2022లో తెలంగాణ జెన్కో జలవిద్యుత్తు విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పదోన్నతి పొంది ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్నారు.
పేరు : పాల్వాయి రజినీకుమారి
పుట్టిన తేదీ: 6-5-1972
స్వస్థలం: సూర్యాపేట
విద్యార్హత: ఎంఏ, ఎల్ఎల్బీ, బీఈడీ
ప్రభుత్వ సర్వీసు: విశ్రాంత గ్రూప్-1 అధికారిణి, రాజకీయ నాయకురాలు
పాల్వాయి రజినీకుమారి 1996లో నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో టీచర్గా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో గ్రూప్-1 సర్వీసుకు ఎంపికయ్యారు. 2004లో సర్వీసుకు రాజీనామా చేసి సూర్యాపేట నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2014లో తుంగతుర్తి నుంచి బరిలో నిలిచారు. అనంతరం భాజపాలో.. గత ఏడాది కాంగ్రెస్లో చేరారు.
ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్
వయసు: 58 సంవత్సరాలు
స్వస్థలం: హైదరాబాద్
విద్యార్హత: బీటెక్, పీహెచ్డీ
ప్రభుత్వ సర్వీసు: విశ్రాంత పోస్టల్ సర్వీసు అధికారి
హైదరాబాద్కు చెందిన అమీరుల్లాఖాన్ 1993లో ఇండియన్ పోస్టల్ సర్వీసుకు ఎంపికయ్యారు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2004లో దిల్లీ జేఎంఐ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఉర్దూ యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ శిక్షణకు డైరెక్టర్గా పనిచేశారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్గా, పాలసీ అడ్వైజర్గా వ్యవహరించారు. గ్లోకల్ యూనివర్సిటీకి వ్యవస్థాపక వైస్ఛాన్సలర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య