Medicine: కలల చదువు కోసం ఖండాంతరాలకు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ కల్లోలం రేపుతోంది. వైద్యవిద్య అభ్యసించడమే లక్ష్యంగా మన విద్యార్థులు ఖండాంతరాలు దాటుతున్నారు.
విదేశాల్లో వైద్యవిద్యపై ఆసక్తి
తెలుగు రాష్ట్రాల నుంచే ఏటా 3 వేల మందికి పైగా పయనం
ఎఫ్ఎంజీఈలో మాత్రం 80 శాతం మంది వైఫల్యం
ఈనాడు, హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతీయ విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ కల్లోలం రేపుతోంది. వైద్యవిద్య అభ్యసించడమే లక్ష్యంగా మన విద్యార్థులు ఖండాంతరాలు దాటుతున్నారు. ఒక్క ఉక్రెయిన్లోనే వేల మంది చదువుతున్నారు. తమ కలలను యుద్ధం కల్లలు చేస్తుందేమోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మన దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అయిదేళ్లకయ్యే రుసుములో మూడో వంతుతోనే చదివే వెసులుబాటు ఉండడం.. విదేశీ వైద్యవిద్యకు ప్రాధాన్యమివ్వడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏటా మన దేశం నుంచి చైనా, ఉక్రెయిన్, నేపాల్, ఫిలిప్పీన్స్, రష్యా, హంగరీ, బల్గేరియా, కరేబియన్ దీవులు, కిర్గిస్థాన్ తదితర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 20వేలకు పైగానే ఉంటోందని అంచనా. వీరిలో తెలుగు రాష్ట్రాలవారు 3,000 మంది వరకూ ఉంటారని తెలుస్తోంది. అంతకుముందుతో పోలిస్తే రెండేళ్లుగా కొవిడ్ కారణంగా విదేశాల్లో వైద్యవిద్య కోసం కన్సల్టెన్సీలను సంప్రదించేవారి సంఖ్య దాదాపు 70 శాతానికి పైగా తగ్గిందని తెలుస్తోంది. ఈ ఏడాది(2021-22) మాత్రం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో గతంలోలానే విద్యార్థులు విదేశాలకు వెళ్లారని కన్సల్టెన్సీ నిర్వాహకులు డా.సతీశ్ తెలిపారు.
ఖర్చు తక్కువే..
మన దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయడానికి కనీసం రూ.75-85 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. తెలంగాణలో 23 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా.. ఏడు మినహా మిగిలిన వాటిలో యాజమాన్య కోటాకు ఏడాదికి రూ.11.55 లక్షలు, ప్రవాస భారతీయ కోటాకు రూ.23.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఏడు కళాశాలల్లో ఇటీవల రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ పెంచారు. దీంతో అయిదేళ్ల వైద్యవిద్య కోర్సుకు అదనపు ఖర్చులతో కలిపి రూ.కోటికి పైగా వెచ్చించాల్సి వస్తోంది. విదేశాల్లో గరిష్ఠంగా రూ.25-30 లక్షల్లోపే అవుతోంది. చైనాలో రూ.25 లక్షలు, ఫిలిప్పీన్స్లో రూ.25-30 లక్షలు, ఉక్రెయిన్లో రూ.25 లక్షలు, కిర్గిస్థాన్లో రూ.20 లక్షలు, రష్యాలో రూ.25-30 లక్షల చొప్పున ఖర్చవుతోంది.
అర్హత పరీక్షలో 20 శాతానికి మించని ఉత్తీర్ణత
విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్లో సేవలందించాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) నిర్వహించే ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ)లో తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రాష్ట్ర వైద్య మండలి(ఎస్ఎంసీ)లో తమ అర్హతను నమోదు చేసుకుని వైద్య సేవలందించడానికి, పీజీ నీట్ రాసేందుకు అర్హత లభిస్తుంది. ఎఫ్ఎంజీఈలో ఏటా ఉత్తీర్ణులవుతున్నవారి సంఖ్య 20 శాతానికి మించడం లేదు. చైనాలోని దాదాపు 100 కళాశాలల్లో మన విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. వాటిలో 100 మంది కంటే ఎక్కువగా చేరుతున్న కళాశాలలు సుమారు 50 ఉన్నాయి. 2019లో వాటిలో ఒక్క కళాశాల నుంచీ ఎఫ్ఎంజీఈలో 20 శాతాన్ని మించి ఉత్తీర్ణత సాధించలేదు. కొన్ని దేశాల్లోని కళాశాలల్లో చదివినవారెవరూ ఉత్తీర్ణత సాధించలేదు. కాగా, ఎఫ్ఎంజీఈ స్థానంలో త్వరలో ‘నెక్స్ట్’(నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్) అందుబాటులోకి రానుంది.
విద్యార్థుల వైఫల్యానికి కారణాలు..
* మన దేశ వైద్యవిద్య నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా కొన్ని విదేశాల్లో ఉండకపోవడం
* కళాశాల ఎంపికలో పొరపాటు
* వైద్యవిద్య అభ్యసన కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం
* అనుభవపూర్వక పరిజ్ఞానం కోసం రోగులతో మాట్లాడాల్సి ఉండగా.. స్థానిక భాష అర్థం కాకపోవడం
* కేవలం విద్యాపరంగా ఉత్తీర్ణత సాధిస్తే చాలనే ధోరణితో పాఠ్యాంశాలపైనే దృష్టిపెట్టడం
* విదేశాల్లో వైద్యవిద్య చదివి తిరిగొచ్చాక.. ఏదో ఒక ఆసుపత్రిలో అనధికారికంగా పనిచేస్తూ అర్హత పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం
ఆచితూచి వ్యవహరించాలి
విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పలు సూచనలు చేసింది.
* దేశాన్ని, కళాశాలను విద్యార్థులు ఆచితూచి ఎంచుకోవాలి.
* ఎన్ఎంసీ అనుమతించిన విదేశాలను, కళాశాలలనే ఎంపిక చేసుకోవాలి.
* విదేశీ వైద్య కళాశాలలో చేరడానికి ముందే.. ఎన్ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రాన్ని(ఈసీ) పొందాలి.
* ఆంగ్లంలో బోధించే కళాశాలను ఎంచు కోవడం ఉత్తమం.
* విదేశాల్లో వైద్యవిద్య చదివేందుకు వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థీ ఎన్ఎంసీ వెబ్సైట్ను తప్పక చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్