TRS: ధాన్యం సేకరణలో కేంద్రం ఘోరవైఫల్యం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం సేకరణలో ఘోరవైఫల్యం చెందిందని, పరిష్కారం చూపమంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తదితరులు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ
భాజపా ఎదురుదాడి సిగ్గుచేటు
దమ్ముంటే కిషన్రెడ్డి వడ్లు కొనిపించాలి
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల
విలేకరుల సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం సేకరణలో ఘోరవైఫల్యం చెందిందని, పరిష్కారం చూపమంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తదితరులు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు మెడమీద కత్తి పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. భాజపా నేతలే దేశంలో అందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటారా? కొనరా? కేంద్రమంత్రిగా, తెలంగాణ వాసిగా కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. లేదా కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర రైతులకు నేరుగా, వివరంగా తెలియజేయాలన్నారు. కాని పక్షంలో తమ అసమర్థతను ఒప్పుకొని, భవిష్యత్ పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు.ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ధాన్యం గింజ కొనేవరకు కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపాను వదలబోమని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని కేంద్రం వరి కొనేలా ఒప్పించాలని సూచించారు. ఆయనకు రైతుల మీద ప్రేమ ఉంటే తాము ధాన్యం సేకరణ కోసం చేపడుతున్న ధర్నాలో పాల్గొనాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ను అదుపులో పెట్టాలన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో నిరంజన్రెడ్డి, కమలాకర్లు విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడురోజులుగా సీఎం కేసీఆర్, రాష్ట్రమంత్రులుగా తాము రైతుల సమస్యలపై ఆందోళనతో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని డిమాండు చేస్తుంటే... దానికి జవాబు చెప్పకుండా కేంద్రాన్ని బెదిరిస్తున్నారంటూ కిషన్రెడ్డి సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరం. ఏడేళ్లుగా కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా, సంస్కారహీనంగా నిందించింది భాజపా నేతలు, ఎంపీలే. ఈ విషయం దేశమంతా తెలుసు. భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వయంగా పలుమార్లు ట్విటర్లో, మీడియాలో భాజపా ప్రభుత్వవైఖరిని వివరిస్తున్నారు. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదు. ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్ రైస్) గతంలో కేంద్రమే ప్రోత్సహించింది. అందువల్లే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయి. ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది.
పంజాబ్ మాదిరిగా ఎందుకు కొనరు?
పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లను కేంద్రం ఎందుకు కొనదు?దశాబ్దాల హరితవిప్లవం, కేంద్రం సహకారం వల్ల పంజాబ్లో వరి ఉత్పత్తి పెరిగింది.అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగింది. ధాన్యం సొమ్మును రైతులకు మేం వారం రోజుల్లోనే చెల్లిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోంది. ఈ తాత్సారంతో జరిగే నష్టం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా చలనం లేదు.దేశంలో మూడు లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని, వరి వద్దు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ అంటున్నారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యం పండించాలని కేంద్రం వైఖరికి విరుద్ధంగా చెబుతున్నారు.ఇన్నాళ్లూ కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంది. ఇప్పుడు ఎందుకు తీసుకోలేమంటున్నారు? ఒకవేళ ఉప్పుడు బియ్యం తినే వాళ్లు దేశంలో తగ్గిపోతున్నారంటే.. అందుకు పరిష్కారం చూపెట్టాలి కదా? అలా చెప్పకుండా మధ్యలోనే చేతులెత్తేస్తే ఎలా?’’ అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ‘‘మంత్రి కేటీఆర్తో కలిసి గత సెప్టెంబరులో దిల్లీకి వెళ్లి తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరా.. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయని, కొననే కొనం అన్నారు. ఎంత కోరినా పట్టించుకోలేదు. పంట మార్చండి అని ఉచిత సలహాలు ఇచ్చారు. అప్పుడే కిషన్రెడ్డి, సంజయ్లు ఈ విషయం మీద స్పందించాలని, కేంద్రాన్ని ఒప్పించాలని కోరితే నోరు తెరవలేదు. ఈ రోజు రైతులను రెచ్చగొడుతున్నారు’’ అని గంగుల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం