వాయేజర్-2 నుంచి అందుతున్న సంకేతాలు!
భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది.
కేప్ కెనావెరాల్: భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది. ఈ వ్యోమనౌకను నియంత్రించే అధికారులు రెండు వారాల కిందట పొరపాటున తప్పుడు ఆదేశం ఇచ్చారు. ఫలితంగా వాయేజర్-2 యాంటెన్నా.. భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు ప్రపంచంలో పలు చోట్ల భారీ రేడియో యాంటెన్నాలు ఉన్నాయి. వాటికి తాజాగా వాయేజర్-2 నుంచి సంకేతం అందింది. దీంతో.. 46 ఏళ్ల నాటి ఆ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటెన్నాను తిరిగి భూమి వైపునకు తిప్పడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
సౌర కుటుంబంలోని గ్రహాలపై పరిశోధనలు సాగించేందుకు వాయేజర్-1, 2 వ్యోమనౌకలను 1977లో ప్రయోగించారు. వాయేజర్-1 ప్రస్తుతం భూమికి 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది గుర్తింపు పొందింది. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. వాయేజర్-2 ప్రస్తుతం 19 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!