Moscow: మాస్కో విమానాశ్రయంపై డ్రోన్ల దాడి
రష్యా రాజధాని మాస్కో అంతర్జాతీయ విమనాశ్రయంపై దాడి జరిగింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia) రాజధాని మాస్కో(Moscow)పై ఆదివారం డ్రోన్లు విరుచుకుపడ్డాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పలు డ్రోన్లను కూల్చివేసిందని పేర్కొంది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయి.
ఈ దాడి వెనుక కీవ్ ఉందని మాస్కో ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించింది. ‘‘జులై 30వ తేదీ ఉదయం కీవ్ పాలకులు మానవ రహిత విమానంతో ఉగ్ర దాడికి యత్నించారు. దీనిని భగ్నం చేశాం. ఒక ఉక్రెయిన్ యూఏవీని కూల్చివేశాం. మరో రెండు డ్రోన్లు కూడా మా ఎలక్ట్రానిక్ వార్ఫెర్ వ్యవస్థ దెబ్బకు నియంత్రణ కోల్పోయి రెండు భవనాలపై కూలిపోయాయి’’ అని రక్షణశాఖ వెల్లడించింది. రెండు ఆఫీస్ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని రష్యా మేయర్ సెర్గీ సోబియన్ పేర్కొన్నారు. సరిహద్దులకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఆదేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.
ఈ ఘటనతో మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేసినట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. దాదాపు గంట తర్వాత ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
-
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!