India-UK FTA: ‘కభీ ఖుషీ కభీ గమ్’: భారత్తో చర్చలపై యూకే నేత ఆసక్తికర వ్యాఖ్యలు
India-UK FTA:భారత్- బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగుతోన్న చర్చల తీరును బ్రిటన్ (Britain) ప్రతిపక్ష నేత ఒకరు ఓ బాలీవుడ్ సినిమాతో పోల్చారు. ‘కభీ ఖుషీ కభీ గమ్’లా ఈ ప్రక్రియ సాగుతోందన్నారు.
లండన్: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో అనుకూల, ప్రతికూల పరిణామాలను యూకే(UK) నేత ఒకరు బాలీవుడ్ సూపర్ హిట్తో పోల్చారు. ‘కభీ ఖుషీ కభీ గమ్(కొన్నిసార్లు ఆనందం.. కొన్నిసార్లు బాధ)’ అంటూ అభివర్ణించారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన దీపావళి వేడుకల్లో భాగంగా చేసిన ప్రసంగంలో ఈ ఒప్పందం గురించి లేబర్ పార్టీ నేత కీర్ స్టామర్ మాట్లాడారు.
‘ప్రపంచ వేదికపై బ్రిటన్(Britain) ఖ్యాతిని మళ్లీ చాటి చెప్తాం. భారత్తో సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో అది సాధ్యమవుతుంది. టోరీ నేతలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Deal) దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నాను. ఆ చర్చలు సాగుతూ..ఆగుతూ నడుస్తున్నాయి. ఆ ప్రక్రియను మనం కభీ ఖుషీ కభీ గమ్ అని పిలవొచ్చు. కానీ లేబర్ పార్టీ(ప్రతిపక్ష పార్టీ) అంతకంటే ఎక్కువగా కోరుకుంటోంది. రెండుదేశాల మధ్య బంధంలో మరింత అవగాహన ఉండాలని కోరుకుంటాం. ఎల్లప్పుడూ సంతోషకర ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగిఉండేందుకు మా పార్టీ కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యం, ఆకాంక్షలు, గౌరవం వంటి పరస్పర విలువలపై ఈ బంధం ఆధారపడి ఉంటుంది’ అని ప్రతిపక్ష నేత కీర్ స్టామర్ వ్యాఖ్యానించారు.
రన్వే నుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..!
ఏఫ్టీఏ(FTA) చర్చలు గతేడాది జవవరిలో ప్రారంభం కాగా.. అదే ఏడాది దీపావళికి ఒప్పందంపై ఒక కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు విధించారు. కానీ అనుకున్న ప్రకారం అది జరగలేదు. తర్వాతి టోరీ ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో కొత్తగా డెడ్లైన్ ఏదీ విధించనప్పటికీ.. వచ్చే ఏడాది భారత్, యూకేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోగా దీనిపై అవగాహనకు రావాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.
ఇటీవల జీ20 సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి చర్చ జరిగింది.చారిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశిస్తున్నారు. ఎఫ్టీఏలో భాగంగా వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, హెల్త్కేర్ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్ విస్కీ, ఆటోమొబైల్స్, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!