Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!
సెవెస్తపోల్లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపై ఉక్రెయిన్ ఇటీవల క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇక్కడి నౌకాదళ కమాండర్ మృతి చెందినట్లు కీవ్ తెలిపింది.
కీవ్: రష్యా ఆక్రమిత క్రిమియా (Crimea)పై కొంత కాలంగా వరుస దాడులు చేపడుతూ వచ్చిన ఉక్రెయిన్.. ఇటీవల ఏకంగా సెవెస్తపోల్లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రష్యా నల్ల సముద్ర నౌకాదళ (Russia Black Sea Fleet) కమాండర్ హతమైనట్లు కీవ్ ప్రత్యేక బలగాలు తాజాగా ప్రకటించాయి. ‘ఇటీవల జరిపిన దాడిలో రష్యా నల్ల సముద్ర నౌకాదళ కమాండర్ సహా 34 మంది అధికారులు మృతి చెందారు. మరో 105 మంది గాయపడ్డారు. నౌకాదళ ప్రధాన కేంద్రం కోలుకోలేని విధంగా ధ్వంసమైంది’ అని పేర్కొన్నాయి.
ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!
క్రిమియాలో రష్యాకు ‘సెవెస్తపోల్’ ప్రధాన నౌకాస్థావరం. ఉక్రెయిన్పై నౌకాదళ దాడులను రష్యా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తోంది. నల్ల సముద్రంపై మాస్కోకు తిరుగులేని ఆధిపత్యం అందించిన ఈ నౌకాశ్రయం.. కొంతకాలంగా ఉక్రెయిన్ దాడులకు లక్ష్యంగా మారింది. సముద్ర డ్రోన్లు, క్షిపణులతో కీవ్ విరుచుకుపడుతోంది. ఇటీవల చేపట్టిన ఓ దాడిలో రష్యాకు చెందిన రెండు నౌకలతోపాటు ఒక సబ్మెరైన్ దెబ్బతింది. శుక్రవారం ఓ క్షిపణి దాడిలో నౌకాదళ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు.. కీవ్ తాజా ప్రకటనపై రష్యా స్పందించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురి తప్పిన సైనిక డ్రోన్
నైజీరియాలో రెబల్స్పైకి సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్ గురి తప్పి పౌరులపై పడింది. ఈ ఘటనలో 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. కదూనా రాష్ట్రంలోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మత ఉత్సవం చేసుకుంటున్న వారిపై ఆకస్మాత్తుగా డ్రోన్ బాంబు పడింది. -
అమెరికాలోని ఓ ఇంట్లో కాల్పులు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో తుపాకీ కాల్పులకు అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి క్లార్క్ కౌంటీలోని ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బ్రిటన్ ‘ఉపాధి వీసా’ కఠినతరం
-
ఐదు మృతదేహాలతో ఓస్ప్రే విమాన శకలం లభ్యం
జపాన్ తీరానికి చేరువలో కూలిన అమెరికా వాయుసేన విమానం ‘సీవీ-22 ఓస్ప్రే’కు చెందిన శకలాలు, అందులో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సహాయ సిబ్బంది సోమవారం పేర్కొన్నారు. -
దళాలను వెనక్కితీసుకుంటామన్న భారత్
ద్వీప దేశమైన మాల్దీవుల్లో మోహరించిన దళాలను వెనక్కి తీసుకునేందుకు భారత్ అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు తెలియజేశారు. -
ఇండోనేసియాలో బద్దలైన అగ్ని పర్వతం
ఇండోనేసియాలో మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. -
యుద్ధాన్ని విస్తరించిన ఇజ్రాయెల్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. -
నవమాసాలు.. కృత్రిమ గర్భంలో..!
కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం పునరుత్పత్తి విధానాలు గణనీయంగా మారిపోయాయి. ఐవీఎఫ్; అండం, వీర్య దానాలు, గర్భాశయ మార్పిడి, అద్దె గర్భం (సరోగసీ), అండాన్ని శీతలీకరణతో నిల్వ చేయడం వంటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. -
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!
వృద్ధ దంపతులు తమ ఇంటి పెరట్లో ఓ క్రియాశీల బాంబుతో కాలం వెళ్లదీసిన ఘటన బ్రిటన్లో వెలుగుచూసింది. -
Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన
తమ దేశంలో నానాటికీ జనన రేటు క్షీణించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!