AP News: జగన్‌ మోసానికి బలైన యువత.. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస

సీఎం జగన్‌ ఐదేళ్ల తన పాలనలో.. నోటిఫికేషన్ల మాయ చేసి, ప్రైవేటు కంపెనీలను తరిమేసి, నైపుణ్యాభివృద్ధి నిలిపేసి యువతను నిరుద్యోగులుగా మార్చేశారు. ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి కల్పించారు.

Published : 28 Apr 2024 11:00 IST

ఉద్యోగం కోసం నువ్వెళ్లేది ఎక్కడికి..? తెలంగాణా? కర్ణాటకా? తమిళనాడా? ఇది ఏపీలోని విద్యా సంస్థల్లో బీటెక్‌, డిగ్రీ చివరి ఏడాది చదివే విద్యార్థుల్లో ఏ ఇద్దరు కలిసినా ఎదురవుతున్న ప్రశ్న. జగన్‌ హయాంలో ఏపీ దుస్థితికిది నిలువుటద్దం. నోటిఫికేషన్ల మాయ చేసి, ప్రైవేటు కంపెనీలను తరిమేసి, నైపుణ్యాభివృద్ధి నిలిపేసి యువతను నిరుద్యోగులుగా మార్చేశారు. ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి కల్పించారు. ఏపీలో ఉద్యోగాలంటే ఏ మాల్స్‌లోనో, చిన్న కార్ఖానాల్లోనో పనులు చేసుకునే దుస్థితిలోకి నెట్టారు.

Tags :

మరిన్ని