బ్రేకింగ్

breaking
24 May 2022 | 15:52 IST

Stocks: నష్టాలతో ముగిసిన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 236 పాయింట్లు నష్టపోయి 54,052.61 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89.55 పాయింట్ల నష్టంతో 16,125 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 77.58గా ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడగా.. దివీస్‌ ల్యాబ్స్‌, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని