బ్రేకింగ్

breaking
27 May 2022 | 12:09 IST

చెప్పింది వినకపోతే.. చరిత్రహీనులే: చంద్రబాబు

ఒంగోలు: దేశంలో ఎక్కడా లేని విధంగా వైకాపా పన్నులు పెంచిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారు. చెప్పింది వినకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మేం అండగా ఉంటాం. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకొస్తారా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. అమ్మఒడి కంటే నాన్న బుడ్డి ద్వారా వసూలు మొదలు పెట్టారు. రాష్ట్రం పరువుపోయే స్థితికి తీసుకొచ్చారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

మరిన్ని

తాజా వార్తలు