బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 16:05 IST

ఏపీలో మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు

అమరావతి: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉన్నతాధికారిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది. మంగళవారం రాత్రి 8 గంటల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

మరిన్ని

తాజా వార్తలు