BJP-JDS Alliance: హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
కర్ణాటక రాజకీయాల్లో హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. భాజపా-జేడీఎస్ కూటమిపై దీని ప్రభావం ఎలా ఉండనుంది..?
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో మనుగడ కోసం పోరాడుతున్న జేడీఎస్ ప్రతిష్ఠను ఇది దెబ్బతీస్తోంది. మరోవైపు ఆ పార్టీతో పొత్తులో ఉన్న భాజపాకు ఇది ఇబ్బందికర అంశమే. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు ఈ అంశం కూటమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందోనని ఇరు పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారు.
ఉత్తర కర్ణాటకలో నాలుగో దశలో ఎన్నికల పోలింగ్ మే7న జరగనుంది. ఈనేపథ్యంలో ఈ వ్యవహారం కూటమికి ఇబ్బందికర అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన సిట్ బలమైన ఆధారాలను సేకరించకపోతే ఇది రాజకీయంగా అంతగా ప్రభావం చూపించదని చెబుతున్నారు. దక్షిణ కర్ణాటకలో పోలింగ్కు ముందు ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నట్లు ప్రకంపనలు సృష్టించి ఉంటే.. దీని పరిణామాలు వేరేవిధంగా ఉండేవని చెబుతున్నారు.
మరోవైపు ఈ వ్యవహారం నుంచి మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి దూరం జరిగారు. అది పూర్తిగా రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. దానితో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ.. దీన్ని కుట్రగా కొట్టిపారేశారు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివని పేర్కొన్నారు.
ప్రజ్వల్ సస్పెండ్కు రంగం సిద్ధం..
మంగళవారం పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో నిర్ణయించిన అనంతరం ప్రజ్వల్ను సస్పెండ్ చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ‘‘ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రేపు జరిగే కోర్ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తాం. ప్రజ్వల్ లోక్సభ సభ్యుడు. దిల్లీ నుంచే నిర్ణయం తీసుకోవాలి’’ అని వెల్లడించారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఎదుర్కోవాల్సిందేనన్నారు. తాము ఎవరినీ రక్షించడం లేదని చెప్పారు. దీనిపై సిట్ ఏర్పాటుచేశారని.. నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన జిల్లాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మి చౌదరి సిఫార్సు మేరకు ఈ అంశంపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
దేశంలో మోదీ హవా ఏమీ లేదు: జైరాం రమేశ్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఏమీ లేదని, ఆయనకు తెలిసిందల్లా వ్యవస్థలను నాశనం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
మోదీకి నా చేతివంట రుచి చూపిస్తా: మమత
ప్రధాని మోదీకి తన చేతివంట రుచి చూపిస్తానని, చిన్నప్పటినుంచి తనకు వండటం అలవాటేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీని నిషేధించాలంటూ వ్యాజ్యం
తన ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ..విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. -
కాంగ్రెస్ వస్తే.. మళ్లీ గుడారానికి రాముడు
అయోధ్య రాముణ్ని మళ్లీ గుడారానికి పంపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. -
సీఏఏ అమలును మమత అడ్డుకోలేరు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతాబెనర్జీ ఎప్పటికీ అడ్డుకోలేరు. మతువాలతోపాటు శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపజాలదు. -
ఎన్డీయే నేతలు వెంట రాగా.. వారణాసిలో ప్రధాని నామినేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ మంగళవారం నామినేషను దాఖలు చేశారు. -
సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
ప్రధాని నరేంద్ర మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇప్పటివరకు సొంతంగా ఇల్లు, కారు లేదని వెల్లడించారు. -
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే