బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 18:30 IST

అవినాష్‌.. ప్రతిదీ రాజకీయం చేస్తే ఎలా?: సునీత

కడప: వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్‌ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని ఆయన కుమార్తె సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని అంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి.. దీని గురించి పోలీసులతో ఎప్పుడైనా ఆయన మాట్లాడారా?అని ప్రశ్నించారు. కడపలోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా?అని ప్రశ్నించారు. గూగుల్‌ టేకౌట్‌ ఫ్యాబ్రికేటెడ్‌ అని అవినాష్‌ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. గూగుల్‌ టేకౌట్‌ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ తయారు చేశాయని, అవినాష్‌పై వాటికి కోపం ఉంటుందా? అని ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు