బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 21:23 IST

నరైన్‌ ‘శతక’ బాదుడు.. రాజస్థాన్‌ టార్గెట్‌ 224

కోల్‌కతా: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్‌ నరైన్‌ (109; 56 బంతుల్లో 13×4, 6×6) శతకంతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాల్ట్ (10), శ్రేయస్‌ అయ్యర్‌ (11), రసెల్‌ (13) నిరాశపరిచారు. రఘువంశీ (30) ఫర్వాలేదని పించాడు. చివర్లో రింకూ సింగ్‌ (20*; 9 బంతుల్లో 1×4, 2×6) ఆకట్టుకున్నాడు. అవేశ్‌ఖాన్‌, కుల్‌దీప్‌సేన్‌ చెరో 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, చాహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని

తాజా వార్తలు