బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 23:40 IST

బట్లర్‌ శతకం.. కోల్‌కతాపై రాజస్థాన్‌ విజయం

కోల్‌కతా: ఐపీఎల్‌-17లో రాజస్థాన్‌ ఆరో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. నరైన్‌ (109; 56 బంతుల్లో) శతకంతో అదరగొట్టాడు. అవేశ్‌ఖాన్‌ 2, కుల్‌దీప్‌సేన్‌ 2, బౌల్ట్‌ 1, చాహల్‌ 1 వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. జోస్‌ బట్లర్‌ (107*; 60 బంతుల్లో) చెలరేగి ఆడి శతకం బాదేశాడు. రియాన్‌ పరాగ్‌ (34; 14 బంతుల్లో), పావెల్‌ (26; 13 బంతుల్లో) దూకుడుగా ఆడారు. హర్షిత్‌ రాణా 2, వరుణ్‌ 2, నరైన్‌ 2, వైభవ్‌ 1 వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు