బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 23:14 IST

ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం

దిల్లీ: ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88*), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడారు. గుజరాత్‌ బౌలర్లలో వారియర్‌ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్‌ (65), మిల్లర్‌ (55) అర్ధశతకాలతో చెలరేగారు. సాహా(39) రాణించాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌ (21*) పోరాడినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో రషిఖ్‌ 3, కుల్దీప్‌ 2, నోకియా 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు.   

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని