Karnataka: ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!

తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Published : 06 May 2024 00:07 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు సంచరించే ఓ నదిలోకి విసిరేసింది. చివరకు ఒంటినిండా గాయాలు, ఓ చేయి లేని స్థితిలో ఆ బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ అమానుష ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీ తాలుకాకు చెందిన సావిత్రి, రవికుమార్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి సంతానం మూగవాడు కావడంతో.. అతడి పరిస్థితి విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాంటి బిడ్డను ఎందుకు కన్నావు..? అతడిని దూరంగా విసిరేయమంటూ వేధించేవాడు.

హాసన సెక్స్‌ స్కాం.. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ!

ఇదే విషయమై, శనివారం మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. విసుగెత్తిపోయిన ఆమె ఆ పిల్లాడిని తీసుకెళ్లి మొసళ్లు ఎక్కువగా సంచరించే నదిలో కలిసే కాల్వలోకి విసిరేసింది. స్థానికులు ఇది గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. శరీరమంతా నోటకరిచిన గాయాలతోపాటు ఒక చేయి లేకపోవడంతో.. మొసలి దాడికి గురైనట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, భార్యభర్తలిద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని