బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 17:33 IST

అరాచక శక్తులను ఉపేక్షించొద్దు: చంద్రబాబు

రాజంపేట: అరాచక శక్తులను ఉపేక్షించకూడదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాకు ఓటేస్తే.. ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని హితవుపలికారు. రాజంపేటలో తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలి. జగన్‌పై ప్రజల తిరుగుబాటు మొదలైంది. మేం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు