Scam: మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
Scam Alert | ఇంటర్నెట్డెస్క్: మీ పేరిట లాటరీ తగిలింది.. బ్యాంకు వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్ పంపండి అంటూ మెసేజ్లు, ఇ-మెయిల్లో నకిలీ లింకులు, ఫేక్ వెబ్సైట్లను రూపొందించి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం.. ఇలా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలకు తెరతీస్తుంటారు సైబర్ నేరగాళ్లు. అమాయకులను ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ము కాజేస్తుంటారు. వీటిని అరికట్టేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ ఎవరో ఒకరు వీరి వలలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనీ స్వైపింగ్ (Money Swiping Scam) పేరిట కొత్తతరహా మోసాలకు తెరతీశారు.
బెంగళూరుకు చెందిన అదితీచోప్రా అనే మహిళ తాజాగా మనీస్వైపింగ్ స్కామ్ వలలో చిక్కింది. అయితే ఆమె చాకచక్యంగా వారి బారినుంచి తప్పించుకొని ‘ఎక్స్’ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ఆఫీసులో ఉన్న సమయంలో ఓ నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ‘అదితీ, నేను మీ నాన్నకు డబ్బు పంపాలి. ఆయన అందుబాటులో లేనందున మీకు పంపమన్నారు. ఇది నీ నంబర్యేనా?’ అని గట్టిగా అడిగారు. సమాధానం చెబుతుండగానే బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. మొదట రూ.10 వేలు, తర్వాత రూ.30 వేలు. ఇలా బ్యాంకు వాళ్లు పంపే ఫార్మాట్లో ఆ ఎస్సెమ్మెస్ ఉంది. దాన్ని చూస్తుండగానే ఫోన్ చేసిన వ్యక్తి ‘నేను రూ.3 వేలు మాత్రమే ఇవ్వాలి. పొరపాటున రూ.30 వేలు పంపాను. దయచేసి మిగిలిన డబ్బు తిరిగి పంపండి’ అని అడిగాడు’’
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
‘‘ డాక్టర్ దగ్గర ఉన్నానని నా సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా స్కామ్ అని. కొంత సమయం తర్వాత నిశితంగా ఆ మెసేజ్ను పరిశీలించాక బ్యాంక్ నుంచి కాకుండా ఫోన్ నంబర్ నుంచి ఆ ఎస్సెమ్మెస్ వచ్చిందని గ్రహించాను. వెంటనే బ్యాలెన్స్ చెక్ చేసి అదే నంబర్కు తిరిగి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాల్ కలవట్లేదు. అప్పటికే ఆ మోసగాడు నా నంబర్ను బ్లాక్ చేశాడు’’ అంటూ సుదీర్ఘ ట్వీట్ చేశారు. సంబంధిత స్క్రీన్ షాట్లు కూడా పంచుకొని.. ఇలాంటి స్కామ్లపై జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లకు సూచించారు. డెబిట్/క్రెడిట్ మెసేజ్లు వస్తే ముందుగా బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేక యాప్ల ద్వారా చెక్ చేయటమే ఉత్తమం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!