బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 18:46 IST

వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్‌ కల్యాణ్‌

రాజోలు: రాష్ట్రంలో మార్పు కనిపిస్తోందని, వైకాపాను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల తన సంపాదనలో రూ.70 కోట్లు పన్ను కట్టానన్న పవన్‌.. డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జగన్‌పై గులకరాయి పడితే.. అంతమంది జనసమూహంలో నిందితుడిని పట్టుకున్నారని.. కానీ, అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని