Crime: ప్రైవేట్‌ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి

క్రికెట్‌ ఆడుతుండగా బాల్‌ ప్రైవేట్‌ పార్ట్‌కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.

Published : 07 May 2024 00:06 IST

పుణె: క్రికెట్‌ ఆడుతుండగా బాల్‌ ప్రైవేట్‌ పార్ట్‌కు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పూణేలోని లోహెగావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లోహెగావ్‌కు చెందిన శంభు కాళిదాస్ అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికిట్‌ ఆడడానికి వెళ్లాడు. ఆటలో భాగంగా శౌర్య బౌలింగ్ చేస్తుండగా మరో బాలుడు బ్యాటింగ్‌ చేస్తున్నాడు. వేగంగా వచ్చిన బంతి బాలుడి ప్రైవేటు పార్టులో బలంగా తాకడంతో అతడు  కుప్పకూలి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 

ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన అతడి స్నేహితులు బాలుడిని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన చుట్టుపక్కలవారు అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు ప్రమాదవశాత్తూ మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని