Mumbai vs Hyderabad: సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
వరుస ఓటములతో ఢీలా పడిన ముంబయి ఊరట. హైదరాబాద్తో జరిగిన పోరులో ఆజట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముంబయి: వరుస ఓటములతో ఢీలా పడిన ముంబయికి సొంతమైదానంలో ఊరట లభించింది. హైదరాబాద్తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48: 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. చివర్లో కెప్టెన్ కమిన్స్ (35*: 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. మిగతవారు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా, హార్దిక్ తలో మూడు వికెట్లు తీయగా, కంబోజ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబయి.. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) అజేయ శతకం (102*: 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లు)తో విధ్వంసం సృష్టించిన వేళ ఆ జట్టు 17.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) (37*: 32 బంతుల్లో 6 ఫోర్లు) సూర్యకి సహకరించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాన్సెన్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన సూర్యకుమార్..
174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. భువనేశ్వర్ వేసిన తొలి బంతికి ఇషాన్ ఫోర్ కొట్టగా, రెండో బంతికి లెగ్ బైస్ అయి ఫోర్ వెళ్లింది. రోహిత్ శర్మ ఫోర్ బాదడంతో తొలి ఓవర్లోనే 13 పరుగులు వచ్చాయి. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ (9) మయాంక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ(4) క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ నమన్ ధీర్ను డకౌట్ చేశాడు. దీంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పెను విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో తిలక్ వర్మ రెండు ఫోర్లు బాదగా, ఆఫ్ స్టంఫ్ మీదుగా సూర్య భారీ సిక్సర్ దంచాడు. దీంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్లో జాన్సెన్కు సూర్య చుక్కలు చూపాడు. రెండు ఫోర్లు, రెండు సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు వరుసగా మూడు ఓవర్లు కట్టదిట్టంగా బౌలింగ్ వేయడంతో ముంబయి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 84 పరుగులతో నిలిచింది. నితీశ్ రెడ్డి వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన సూర్య.. తర్వాత ఓవర్లో రెండు పరుగులు తీసి 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ముంబయి 139 పరుగులతో నిలిచింది. అప్పటి విజయ లక్ష్యం 30 బంతుల్లో 35 పరుగులుగా మారింది. కమిన్స్ వేసిన 17వ ఓవర్లో సూర్య విశ్వరూపం చూపాడు. వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్తో శతకానికి చేరువయ్యాడు. లక్ష్యం 3 ఓవర్లలో 7 పరుగులు కాగా, 18వ ఓవర్లో తొలి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీయగా, స్ట్రైకింగ్లోకి వచ్చిన సూర్య కుమార్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్ బాది శతకం చేయడమే కాకుండా మ్యాచ్ను గెలిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు