బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 16:12 IST

సీఎం రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు!

 Updated: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, సోషల్‌ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్‌, పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్‌ తదితరులకు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 1న ఫోన్‌ తీసుకొని విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం.

మరిన్ని

తాజా వార్తలు