ఎంబీఏకు మ్యాట్‌ మార్గం!

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ/ పీజీడీబీఏ) కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (మ్యాట్‌) అందులో ఒకటి. ఈ పరీక్షను ఏడాదికి నాలుగు సార్లు రాసుకోవచ్చు.

Updated : 11 Jan 2024 02:21 IST

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ/ పీజీడీబీఏ) కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (మ్యాట్‌) అందులో ఒకటి. ఈ పరీక్షను ఏడాదికి నాలుగు సార్లు రాసుకోవచ్చు. ఇటీవల ఫిబ్రవరిలో నిర్వహించే మ్యాట్‌ ప్రకటన వెలువడింది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా 600కు పైగా సంస్థలు మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరే అవకాశం కల్పిస్తున్నాయి.

రీక్షను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో కోరుకున్న విధానంలో రాసుకోవచ్చు. ఆసక్తి ఉంటే రెండు రకాలుగానూ ప్రయత్నించవచ్చు. రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+ఐబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ+ఐబీటీ), పేపర్‌ బేస్డ్‌ టెస్టు అండ్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (పీబీటీ+సీబీటీ)... వీటిలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), ఆస్కీ, గీతం, చైతన్య, ధృవ, గురునానక్‌, విజ్ఞాన జ్యోతి, హెచ్‌బీఎస్‌, అరోరా, ఐఐఆర్‌ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం... సంస్థలు ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది. దేశవ్యాప్తంగా 50కు పైగా కేంద్రాల్లో పేపర్‌ బేస్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఇంటి నుంచే...  

రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్టు (ఐబీటీ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, వెబ్‌ క్యామ్‌ ఉంటే సరిపోతుంది. ఈ విధానంలో పరీక్షలు ప్రతి రోజూ రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. నచ్చిన తేదీ, సమయం ఎంచుకునే వెసులుబాటు అభ్యర్థులకు ఉంటుంది. ఈ విధానంలో ఫిబ్రవరి 24, మార్చి 3, మార్చి 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

పరీక్ష విధానం

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, మ్యాథమెటికల్‌ స్కిల్స్‌, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌కు 30, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌కు 30, మ్యాథ్స్‌ స్కిల్స్‌కు 40, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీకి 35, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. మాదిరి ప్రశ్నలు, మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

అర్హత: డిగ్రీ పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు: అన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.
ఫీజు: పేపర్‌ / ఆన్‌లైన్‌ ఏదో ఒక పద్ధతిలో రాయడానికి రూ.2100. రెండు విధాలుగానూ రాసుకోవడానికి రూ.3300
పీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 20
పేపర్‌ ఆధారిత రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 25
కంప్యూటర్‌ బేస్డ్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 5
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 10
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: పేపర్‌ బేస్డ్‌.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం. కంప్యూటర్‌ బేస్డ్‌.. హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://mat.aima.in/ 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని