TS TET: తెలంగాణ ‘టెట్‌’ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు.

Updated : 01 Aug 2023 17:25 IST

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET2023)కు మంళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఆగస్టు 2 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  దరఖాస్తు రుసుం 400. సెప్టెంబర్‌ 15న ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌1 ; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 9 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని