పట్టణాల్లోని ఆలయ భూముల లీజులకు కమిటీ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని ఆలయాల భూములను సద్వినియోగం చేసుకునేలా, వాటిని దీర్ఘకాలిక లీజులకు ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాదాయశాఖ కార్యదర్శి, కమిషనర్, ఆ శాఖ చీఫ్‌ ఇంజినీర్, ఆయా ఆలయాల ఈవోలు ఈ కమిటీలో ఉంటారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని ప్రధాన, ముఖ్య ఆలయాలకు చెందిన భూములు ఖాళీగా ఉన్నాయి. వాటిలో భక్తులకు వసతుల కల్పనకు వీలుగా పెద్ద హోటళ్ల వంటివి నిర్మించేందుకు ముందుకొచ్చే వారికి అవసరమైన భూములను దీర్ఘకాలిక (33 ఏళ్లకు) లీజులకు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనివల్ల ఆయా ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు, ఆలయానికి అదనపు రాబడి రానుంది. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

ఖాళీ స్థలాల లీజులకు ప్రతిపాదనలు పంపండి

రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన ఖాళీ స్థలాలను 11 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు.. ఆ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీచేశారు. పది రోజుల్లో ప్రతి జిల్లా నుంచి కనీసం 10 ప్రతిపాదనలు పంపాలని కోరారు. వీటిని టెండరు/బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నారు.

  • ప్రతి జిల్లా దేవాదాయశాఖ అధికారి.. నెలకు కనీసం మూడు చొప్పున  ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కోరారు. ఆలయ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు.
  • దేవాదాయశాఖకు చెందిన 80,793 ఎకరాలు ఇంకా వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదని గుర్తించారు. అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులూ అక్కడి కలెక్టర్లు, జేసీలకు లేఖలు రాసి, ఆ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదయ్యేలా చూడాలని కమిషనర్‌ ఆదేశించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు